ఒకేసారి 130 మందికి ప్రమోషన్లు.. రేవంత్ సర్కార్ కీలక ఉత్తర్వులు

  • పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు
  • ఏడేళ్ల తర్వాత కార్యదర్శులకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్
  • ఒకేసారి 130 మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి
  • ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం
  • ఔట్ సోర్సింగ్ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని వినతి
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ఫైల్‌కు మోక్షం కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 140 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పించారు. 2018 కంటే ముందు ప్రమోషన్ పొందిన వారికి 10 శాతం కోటా కింద ఇప్పుడు సూపరింటెండెంట్లుగా అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలోని రెండు మల్టీ జోన్ల పరిధిలో అర్హులైన 9 మందికి పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్, ఆర్డీ) శాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే, పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 130 మందికి పైగా సీనియర్ అసిస్టెంట్లకు ఒకేసారి సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంబంధిత మంత్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్యదర్శులను వెంటనే క్రమబద్ధీకరించాలని పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పీఆర్, ఆర్డీ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు.

Telangana Government
Revanth Reddy
panchayat raj
employee promotions
government jobs
superintendents
senior assistants
Telangana
job regularisation

More Telugu News